ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్ సభ రేపటికి వాయిదా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 12:30 PM

న్యూఢిల్లీ : సభ్యల ఆందోళనలతో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. విభజన హామీల కోసం తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు, రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు పోడియంలోనికి దూసుకెళ్లి నినాదాలతో సభను హోరెత్తించారు. ఆ గందరగోళం మధ్యనే కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీ విభజన హామీలను అమలు చేయాలని ఏపీ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. వివిధ పార్టీల ఎంపీలు వేర్వేరు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తుండటంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గందరగోళం మధ్యనే సర్కార్ బిల్లులను ప్రవేశపెడుతున్నది. కాగా సభ్యులు సంయమనం పాటించి సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభా వ్యవహారాల మంత్రి అనంతకుమార్ పదే పదే చేస్తున్న విజ్ణప్తులను ఎంపీలు పట్టించుకోవడం లేదు. ఏపీకి విభజన హామీల కోసం తెలుగుదేశం ఎంపీలు స్పీకర్ పోడిం ను చుట్టుముట్టారు. రిజర్వేషన్ల విషయంలో తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ తెరాస ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. ఈ గందరగోళం మధ్యలోనే మంత్రి అనంతకుమార్ ఆర్థిక బిల్లు ఆమోదానికి సహకరించాలని పదే పదే విజ్ణప్తి చేస్తున్నారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa