ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతబస్తీలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 04:27 PM

పాతబస్తీలోని మూసాబౌలిలో భారీచోరీ జరిగింది. ఓ బంగారు నగల దుకాణంలో చొరబడిన 10 మంది దుండగులు బీభత్సం సృష్టించారు. దుకాణంలో ఉన్నవారిని మారణాయుధాలతో బెదిరించి సుమారు 5కిలోల బంగారం చోరీ చేశారు. దీంతో బాధితులు చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


దీనిపై డీసీపీ మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుకున్నట్టు చెప్పారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 10 నుంచి 12 మంది వ్యక్తులు దుకాణంలోకి చొరబడ్డారు. ఆ సమయంలో 21 మంది పనిచేస్తున్నారు. వారికి కత్తి చూపించి బెదిరించారు.అంతేకాకుండా కొందరిని కాళ్లు, చేతులు కట్టేసి సుమారు 5కిలోల బంగారం తీసుకెళ్లినట్టు ఫిర్యాదు వచ్చింది. వెంటనే మేం అప్రమత్తమయ్యాం. సీసీ కెమెరాలు తీసుకెళ్లాం. గతంలో ఇక్కడ పనిచేసినవారు, ఇప్పుడు చేస్తున్నవారి హస్తం ఉన్నట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. మీడియాలో వస్తున్నట్టు కాల్పులు జరగడంగానీ గానీ, ఎవరికీ గాయాలు కావడం గానీ జరగలేదు. బెదిరించి బంగారం తీసుకెళ్తుంటే అక్కడ 25 మంది ఉన్నా కనీసం ఎందుకు అడ్డుకోలేదనే కోణంలో విచారిస్తున్నాం. ఇప్పటికీ కొన్ని ఆధారాలు దొరికాయి. అతి త్వరలోనే మేం ఈ కేసును ఛేదిస్తాం. దుండగులను పట్టుకుంటాం. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో పరిశీలించాం. పథకం ప్రకారం సినిమాటిక్‌గా ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారు ఇక్కడ పనిచేసుకుంటున్నారు. ఈ కేసును మేం ఛాలెంజింగ్‌గా తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తాం.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa