ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ శాఖకు 15 కిలోల బంగారు నగలు: సీపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 05:05 PM

హైదరాబాద్ : చాంద్రాయణ గుట్ట వాహన తనిఖీల్లో భాగంగా నిన్న రూ.5 కోట్లు విలువ చేసే 15 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలను సీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. బెంగళూరు, మైసూరులో నగలు తయారు చేయించినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని రాజారాం జ్యువెల్లర్స్ పేరుతో నగలు చేయించినట్లు నిర్ధారించామన్నారు. ఆభరణాలు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. పట్టుబడ్డ 15 కిలోల బంగారు నగలను ఐటీ శాఖకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టడానికే అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని, బంగారం పట్టుబడ్డ సమయంలో వారి వద్ద ఎలాంటి బిల్లులు లేవని సీపీ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న ఆటోలో బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకన్న సంగతి తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa