ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగి ఆదిత్యనాథ్ మరో వివాదాస్పద వ్యాఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 07, 2018, 12:35 PM

హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుందని, నమాజ్ నిత్యమూ వస్తుందని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. తానో హిందువునని, రంజాన్ పండగను ఎందుకు జరుపుకోవాలని ఆయన ప్రశ్నించారు. యూపీ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు విపక్ష సమాజ్ వాదీ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఆయన, "నేను హిందువును. ఈద్ జరుపుకోను. అసలు రంజాన్ ను నేనెందుకు జరుపుకోవాలి? నా మతం నాకు గర్వకారణం. నేను వారిలా మత విశ్వాసాలతో ఆడుకునే వ్యక్తిని కాదు. ఓ వైపు గుడిలో కాశీదారాలు కట్టించుకుని, మరోవైపు నెత్తిన టోపీ పెట్టుకుని, ఇంకోవైపు మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేయను, చేయబోను" అని అన్నారు. త్రిపురలో ఎన్డీయే కూటమి విజయాన్ని ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రంలో పాతికేళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పడిందని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa