తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు చోటు లేదని నల్గొండ శాసనసభ నియోజకవర్గం ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా మారిన కనగల్ మండలం గడ్డంవారి ఎదవల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలు కార్యకర్తలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వచ్చందంగా గులాబీ గూటికి వరుసలు కడుతున్నప్పుడు, ఇంకా విపక్షాలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఎక్కడిదని అన్నారు. కేసీఆర్ కిట్ పథకం, కల్యాణలక్ష్మి పథకం ద్వారా వివాహం సమయంలో, ఆసరా పింఛన్ రూపంలో వృద్యాప్యంలో, బోధకాల వ్యాధి గ్రస్తులకు సీఎం కేసీఆర్ ఆపన్న హస్తం అందిస్తున్నప్పుడు విపక్షాల ఊసే ఎత్తే వారు ఊళ్ళో లేరని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నారని అయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa