ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 12:53 PM

హైదరాబాద్ : టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు. ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ సదస్సుకు అమెరికా, జపాన్, యూకే, రష్యా, సింగపూర్ సహా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 125 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 11 వరకు ఏవియేషన్ షో నిర్వహించనున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa