ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: స్పీకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 03:04 PM

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ మధుసూదనాచారి సూచించారు. అసెంబ్లీ సమావేశాల భద్రతపై పోలీస్ ఉన్నతాధికారులతో స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ సమావేశమయ్యారు. సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ సభ్యులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాసనసభ సజావుగా కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పండగలు, ఉత్సవాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉత్సవాలను పోలీసులు లాఠీ లేకుండా విజయవంతం చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖ పనితీరును స్వామిగౌడ్ అభినందించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రావు, ఇతర పోలీస్‌ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa