యూపీ : కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మస్క్యులర్ డిస్ట్రోపీ (కండరాల బలహీనత) వ్యాధితో బాధపడుతున్న అనామిక మిశ్రా స్వాగతించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనామిక మిశ్రా మాట్లాడుతూ..తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని 2014లో ప్రధాని నరేంద్రమోదీని కోరగా..ఈ అంశంపై దృష్టి సారించాలని స్థానిక అధికారులకు చెప్పారని పేర్కొంది. కారుణ్య మరణం అంశంలో సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుందని, ఇపుడు తనకు ఉపశమనం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది అనామికా మిశ్రా. మస్క్యులర్ డిస్ట్రోపీతో బాధపడుతున్న తన కూతురు అనామికా మిశ్రాను యుథనేషియాకు అనుమతించాలని ఆమె తల్లి 2014లో ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. తనకున్న దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. అనామికా మిశ్రా తండ్రి కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa