ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 10, 2018, 09:10 AM

హైదరాబాద్ : మిలియన్ మార్చ్ ఏర్పాటుకు టీఎస్ జేఏసీ కోరిన అనుమతిని నగర పోలీసులు నిరాకరించారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌ను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి వచ్చిపోయే ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 


l సికింద్రాబాద్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే వాహనాలను కార్బల మైదాన్ సమీపం నుంచి షెయిలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్‌రోడ్డు, డీబీఆర్ మిల్స్, కట్టమైసమ్మ, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి, రవీంధ్రభారతీ రూట్‌లో 


మళ్లిస్తున్నారు.


l నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను గంగమహాల్-ఇందిరాపార్కు రూట్‌లో మళ్లిస్తారు.


l నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్ వైపు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలను మింట్‌కంపౌండ్ లేదా సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌మార్గ్, నెక్లెస్‌రోటరీ, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు,నల్లగుట్ట, సికింద్రాబాద్ రూట్‌లో మళ్లిస్తారు.


l బషీర్‌బాగ్ వైపు నుంచి అప్పర్‌ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలు మోర్ మెడికల్ హాల్, బాలాజీ గ్యాండ్‌బజార్, క్రిస్టల్ ఐటీ, తెలుగుతల్లి, ఇక్బాల్‌మినార్ మింట్ కంపౌండ్ లేదా రవీంద్రభారతి మీదుగా వెళ్లాలి. 


l సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కర్బాలమైదాన్ నుంచి బుద్దభవన్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు, నెక్లెస్ రోటరీ, వీవీ విగ్రహం లేదా 


తెలుగుతల్లి వైపు వెళ్లాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa