ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది: కోదండరాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 10, 2018, 12:43 PM

హైదరాబాద్: మిలియన్‌ మార్చ్‌ను గుర్తు చేసుకోవడం పాలకులకు ఇష్టం లేదని టీజేఏసీ నేత కోదండరాం మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సోయిలోకి వస్తే ప్రశ్నిస్తారని టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లనీయకుండా వేలాది మంది జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేశారని, తన ఇంటిని పూర్తిగా పోలీస్ దిగ్భందంలో ఉంచారన్నారు.


 నిన్నటి నుంచి జేఏసీ నేతలను పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించారని, అరెస్టయిన నేతలకు పోలీసులు కనీసం తిండి కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నేతల అరెస్టులపై కోర్టుకెళ్తామని కోదండరాం తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ప్రజాకాంక్షను చాటుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఢిల్లీలో స్వేచ్ఛ గుర్తుకు వచ్చిందని...తాము కూడా కేసీఆర్‌ లాగే హక్కుల కోసం పోరాడుతామని కోదండరాం అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa