ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి ఈ-వే బిల్లు

Telangana Telugu |   | Published : Sat, Mar 10, 2018, 04:19 PM

జీఎస్‌టీ ఎగవేతను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన ఈ-వే(ఎలక్ట్రానిక్‌-వే) బిల్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్‌ 1 నుంచి దశల వారీగా రాష్ట్రాల మధ్య జరిగే సరకు రవాణాకు ఈ-వే బిల్లు ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జూన్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా ఈ-వే బిల్లు అమల్లోకి వస్తుంది పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


శనివారం దిల్లీలో 26వ జీఎస్‌టీ మండలి సమావేశం జరిగింది. కాగా.. జీఎస్‌టీ రిటర్న్‌ల సరళీకరణపై ఈ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సరళీకరణ ప్రక్రియపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి ఈ అంశాన్ని వాయిదా వేశారు. దీంతో మరో మూడు నెలల పాటు జీఎస్‌టీఆర్‌ 3బీ ఫైలింగ్‌ను పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa