కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జిల్లాలోని చండూరులో మునుగోడు నియోజకవర్గ ప్రగతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం.. మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో చండూరు జెడ్పీటీసీ సంతోష్ శేఖర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, వివిధ పార్టీలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్లు సహా 300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... "మునుగోడు ప్రజలు ఫ్లోరోసిస్ బాధలను ఎన్నో ప్రభుత్వాలకు చెప్పుకున్నరు. 50 ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదు. 2 లక్షల మంది ప్రజలను జీవచ్ఛవాలుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. 22 ఏండ్ల కింద ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చి ఫ్లోరోసిస్ను తరిమికొడుతం. అసెంబ్లీలో స్వామిగౌడ్పై దాడి చేసి సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నరు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటే కాంగ్రెస్ మంత్రులు ఏం చేశారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరెంట్ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు కాల్పులు జరిపి ప్రజలను చంపించిండు. ముదిగొండ రైతులను చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినం.." అని కేటీఆర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa