ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 10:25 AM

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న శాసన సభలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై జరిగిన దాడిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభలో నిన్న మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై జరిగిన ఘటన దురదృష్టకరమని స్పీకర్‌ అన్నారు. శాసనసభలో ఆయన నిన్నటి ఘటనపై తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. శాసనసభ నుంచి 11 మంది కాంగ్రెస్‌ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. నిన్న శాసనసభలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఘటనపై స్పీకర్‌ మధుసూదనాచారి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి ఘటనపై మంత్రి హరీష్‌రావు కోమటిరెడ్డి సభ్యత్వం రద్దుకు ప్రతిపాదించగా స్పీకర్‌ 11 మంది కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ సభ్యులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, జగీతారెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వంశీచందర్‌రెడ్డి, ఉత్తమ్‌, డీకే అరుణ, ఎన్‌.పద్మావతిరెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, కోమటిరెడ్డి, సంతప్‌లను శాసనభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa