హైదరాబాద్ : రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడ్డ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్ఘాటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడారు. గొర్రెల పంపిణీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. 2.40 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ వైద్యశాలలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్లో బర్రెల పంపిణీ కార్యక్రమం అమలుకు ఆలోచిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు.. దేశంలోనే గొప్పగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa