ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదు : ఎంపీ జితేందర్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 12:36 PM

న్యూఢిల్లీ : రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని రాష్ర్టాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు ఏడో రోజు ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ ప్రాంగణంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రిజర్వేషన్ల అంశంపై స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లపై ఆందోళనతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి లాభం చేకూరదంటూ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ తమన బుజ్జగించే ప్రయత్నం చేశారని అన్నారు. న్యాయబద్దమైన ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదని తాము స్పష్టం చేసినట్లు తెలియజేశారు. మహారాష్ట్రంలో 50కి పైగా రిజర్వేషన్లు పొందుతున్న అంశాన్ని కేంద్రానికి వివరించామని, అవసరమైతే తమను సస్పెండ్ చేయాలని చెప్పినమని జితేందర్‌రెడ్డి వెల్లడించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa