న్యూఢిల్లి : సమాజ్వాదీ పార్టీనుంచి ఇటీవలే బిజెపిలో చేరిన నరేశ్ అగర్వాల్ రాజకీయ నాయకురాలిగా మారిన సినీ నటి జయాబచ్చన్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనితో తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. ఏ ఒక్కరినీ బాధించాలనే ఉద్దేశ్యంతో తాను అలా మాట్లాడలేదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే విచారం ప్రకటిస్తున్నానని నరేశ్ అన్నారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) రాజ్యసభ టికెట్ తనకు ఇవ్వకుండా జయాబచ్చన్కు ఇవ్వడంపై నిన్న నరేశ్ అగర్వాల్ స్పందిస్తూ తన స్థాయిని సినిమాల్లో డాన్సులు చేసే నటి స్థాయికి దిగజార్చేశారని వ్యాఖ్యాలు చేశారు. అందుకే తాను ఎస్పిని వీడి బిజెపిలో చేరానని అన్నారు. కాగా నరేశ్ వ్యాఖ్యలు బిజెపిలో దుమారం రేపాయి. బిజెపి నేతలు సుష్మా స్వరాజ్తో సహా పలువురు నరేశ్పై విమర్శలు సంధించారు. దీనితో ఆయన తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ పేర్కొన్నారు.