హైదరాబాద్: జనసేప పార్టీకి ఆవిర్భావానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నాయకత్వం ఏర్పాట్లు చేసింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ బహిరంగ సభకు వివిధ రాష్ర్టాల నుంచి కర్యకర్తలు, అభిమానులు, ప్రవాసాంధ్రులు తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సుమారు 3 లక్షల మంది సభకు హాజరౌతారని అంచనా వేశారు. ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణంలోకి కార్యకర్తలను అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సాయంత్రం 5 గంటలకు వేదికపై నుంచి ప్రసంగిస్తూ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.