హైదరాబాద్ : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పారామంలో మూడురోజులు ఉగాది వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్రావు తెలిపారు. వసంతోత్సవాల్లో భాగంగా ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిల్పారామం, తంజావూర్ సౌత్జోన్ కల్చరల్ సెంటర్లు సంయుక్తంగా మూడు రోజులపాటు పలు రాష్ర్టాలకు చెందిన కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 18న ఉగాది పండుగను పురస్కరించుకుని సాగి కమలాకరశర్మచే పంచాంగ శ్రవణంతోపాటు డాక్టర్ హిమబిందు ఖనౌజ్ బృందం ఉగాది నవ వసంతం కూచిపూడి నృత్యరూపకం, అంతర్జాతీయ కథక్ నృత్యకారులు హరిచేత కథక్ సంబ్రంలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.