ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బడ్జెట్‌లో కొత్తగా పెట్టుబడి పథకం: మంత్రి ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 14, 2018, 11:22 AM

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారని, పథకాలన్నీ సమర్థంగా అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటల వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో కొత్తగా పెట్టుబడి పథకం తీసుకొస్తున్నామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. ఈనెల 15న అసెంబ్లీలో ఐదో వార్షిక బడ్జెట్‌ను మంత్రి ఈటల ప్రవేశపెట్టనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com