హైదరాబాద్: మిషన్ భగీరథ కింద 190 గ్రామాలకు నీటి సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లిdలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ… శివారు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. మంచినీటి సరఫరాకు రూ.1900 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ శివార్లలో నీటి సరఫరా కోసం రూ.987 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లోపల 180 గ్రామాల కోసం రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామన్నారు.