మండలి: లెండి ప్రాజెక్ట్ అంతరాష్ట్ర పరిధిలో ఉందని కావునా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నాత్తోరల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి కొన్ని గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నాయని చెప్పారు. లెండి ప్రాజెక్ట్పై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు వెల్లడించారు. లెండి ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలోని 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న 25 కిలోమీటర్ల మేర కెనాల్ పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.