హైదరాబాద్:రాష్ట్రంలో బోగస్ రిజిస్ట్రేషన్లకు తావులేదని డిప్యూటీ సీఎం మహమూద్అలీ అన్నారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంలో బోగస్ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయన్నారు. 1930తర్వాత భూ రికార్డులను ప్రక్షాళన చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో 97 శాతం రికార్డుల ప్రక్షాళన పూర్తయిందని పేర్కొన్నారు. త్వరలో కొత్త స్టాఫ్ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు.