ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బడ్జెట్ దేశానికే దిక్సూచి : మంత్రి ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 10:17 AM

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచిగా ఉండబోతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. నీటిపారుదల రంగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధ్యానత ఇచ్చామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పైగా వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం. వ్యవసాయ పెట్టుబడి పథకానికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో రైతులకు రూ. 5 లక్షల బీమా కోసం కేటాయింపులు, గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘం ద్వారా నేరుగా కేటాయింపులు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద ఇచ్చే మొత్తం పెంపుపై ప్రకటించే అవకాశం ఉంది.  ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పేర్కొన్నారు. సామాన్య ప్రజానీకానికి దగ్గరలో బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, సన్నబియ్యం వంటి గొప్ప పథకాలు సీఎం కేసీఆర్ తీసుకురావడం గర్వించదగ్గ విషయమని ఆమె చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa