ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో సముచిత కేటాయింపులు: సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 12:56 PM

హైదరాబాద్ : ఈటల రాజేందర్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అసెంబ్లీ వాయిదాపడిన తరువాత ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో సముచిత కేటాయింపులు జరిపారని పేర్కొంటూ ఈటలను అభినందించారు. పూర్తి సమతుల్యంతో బడ్జెట్ ను ఈటల రూపొందించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఉన్న ఆదాయ వనరులను, రాష్ర్టానికి ఉన్న అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం కుదురుస్తూ బడ్జెట్ రూపొందించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉందన్నారు. పూర్తి సమతుల్యంతో బడ్జెట్ ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఎక్కువ శాతం ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa