ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది భార‌త వృద్ధి 6.5 శాతమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 09:21 AM

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు ఆర్థిక వృద్ధి 7.3 శాతానికి చేరుకోగలదని, 2019-20లో అది మరింతగా 7.5 శాతానికి పెరగొచ్చ‌ని అంచనా వేసినట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వెల్ల‌డించింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయగలదని అవెురికా కేంద్రంగా ఉన్న ఫిచ్ ఏజన్సీ తన ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదికలో పేర్కొంది. కేంద్ర గణాంకాల కార్యాలయ (సి.ఎస్.ఓ) అధికారిక అంచనాలు కూడా 6.5 శాతంగానే ఉండడం విశేషం. ఆర్థిక వ్యవస్థ 2016-17లో 7.1 శాతం వృద్ధి చెందింది. ‘‘వృద్ధిని వెనక్కి లాగుతూ వచ్చిన విధాన సంబంధిత అంశ ప్రభావం ఇప్పుడు పలుచబడిపోయినందున’’ వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని ఫిచ్ పేర్కొంది.


వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు ఆర్థిక వృద్ధి 7.3 శాతానికి చేరుకోగలదని, 2019-20లో అది మరింతగా 7.5 శాతానికి పెరగొచ్చ‌ని అంచనా వేసినట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వెల్ల‌డించింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయగలదని అవెురికా కేంద్రంగా ఉన్న ఫిచ్ ఏజన్సీ తన ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదికలో పేర్కొంది. కేంద్ర గణాంకాల కార్యాలయ (సి.ఎస్.ఓ) అధికారిక అంచనాలు కూడా 6.5 శాతంగానే ఉండడం విశేషం. ఆర్థిక వ్యవస్థ 2016-17లో 7.1 శాతం వృద్ధి చెందింది. ‘‘వృద్ధిని వెనక్కి లాగుతూ వచ్చిన విధాన సంబంధిత అంశ ప్రభావం ఇప్పుడు పలుచబడిపోయినందున’’ వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని ఫిచ్ పేర్కొంది.


 


పెద్ద నోట్ల రద్దు పూర్వ స్థితికి ద్రవ్య సరఫరా
ద్రవ్య సరఫరా పెద్ద నోట్ల రద్దు మునుపటి స్థితికి, 2017 మధ్య కాలంలో చేరుకుందని, గతంలోని ధోరణిలో మాదిరిగానే ఇప్పుడది క్రమంగా పెరుగుతూ వస్తోందని ఫిచ్ తెలిపింది. అలాగే, 2017 జూలైలో తీసుకొచ్చిన వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి) సంబంధింత అవాంతరాలు కూడా క్రమంగా తగ్గిపోయాయని చెప్పింది. రికవరీ సంకేతాలు ప్రదర్శిస్తూ, భారతీయ ఆర్థిక వ్యవస్థ అక్టోబర్-డిసెంబరు కాలంలో ఐదు క్వార్టర్ల గరిష్ఠ స్థితి 7.2 శాతాన్ని తాకింది. వ్యవసాయం, నిర్మాణం, వస్తూత్పత్తి వంటి కీలక రంగాలు మంచి పనితీరు కనబరచడం దానికి దోహదపడింది. ఏప్రిల్‌తో మొదలవుతున్న 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్, ద్రవ్య పటిష్టత మందగతిన సాగుతుందని పేర్కొంది కనుక, అది సమీప కాల వృద్ధి దృక్పథానికి మద్దతిచ్చేదిగానే ఉందని ఫిచ్ తెలిపింది. అల్పాదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే (కనీస మద్దతు ధర, ఉచిత ఆరోగ్య బీమా) వంటి చర్యలు దానిలో ఉన్నాయి. అవి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడానికి తోడ్పడతాయి. మౌలిక వసతుల పెట్టుబడులు ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యాపార సంస్థల పెట్టుబడులు పెంచే పథకాలు కూడా ప్రభుత్వానికి ఉన్నాయని ఫిచ్ గుర్తు చేసింది. ‘‘ఆ విధానాలు గణనీయమైన రోడ్డు నిర్మాణ పథకాలు, గత ఏడాది చివరలో ప్రకటించిన బ్యాంకుల పునర్ మూలధనీకరణ పథకాలకు తోడవుతున్నాయి. ఇవి మధ్య కాలంలో కూడా వృద్ధికి కొంత ఆలంబనగా నిలుస్తాయి’’ అని ఫిచ్ వెల్లడించింది.


 


ద్రవ్యోల్బణం


వినియోగదార్ల ధరల సూచి పెరగడానికి వే గంగా పెరుగుతున్న ఆహార వస్తువుల ధరలే ప్రధాన కారణమని ఫిచ్ వెల్లడించింది. దీనికి భిన్నంగా, ఎక్సైజ్ సుంకాలను వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఇంధన ధరలను అరికట్టగలిగింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో పెట్రోలు పంపుల వద్ద పెట్రోలు, డీజిలు ధరలను అంతో ఇంతో నిలకడగా ఉంచగలిగిందని ఫిచ్ వ్యాఖ్యానించింది. ‘‘ద్రవ్యోల్బణం 2018, 2019 సంవత్సరాలలో, రిజర్వ్ బ్యాంక్ లక్ష్యానికి ఎగువ బ్యాండ్‌లో 5 శాతం కన్నా కొద్ది తక్కువగా ఉండగలదని మేం భావిస్తున్నాం’’ అని ఫిచ్ పేర్కొంది. వృద్ధి మరింత వేగాన్ని పుంజుకున్న తర్వాత, రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లు పెంచడం ప్రారంభిస్తుందని, ద్రవ్యోల్బణ ఒత్తిడులు హెచ్చుగానే ఉంటాయని ఫిచ్ భావిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకం, (ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, మోటారు వాహనాల విడి భాగాలు) వంటి కొన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకాలు పెంచినందు వల్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa