చండీఘడ్: సొంత అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా మ్యాచ్లను ఆడాలనుకున్న ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఓ చిక్కొచ్చి పడింది. చండీఘడ్ విమానాశ్రయాన్ని మరమ్మతుల పేరిట మే 12 నుంచి మే 31 వరకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలిలో ఆడనున్న లీగ్లోని రెండు మ్యాచ్లను రీ షెడ్యూల్ చేయాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. బీసీసీకి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంత మైదానం మొహాలిలో మే 4 నుంచి మే 14 మధ్య నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
ఈ అంశంపై బీసీసీఐ ప్రెసిడెంట్ సీకే ఖన్నా మాట్లాడుతూ.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఓ విజ్ఞప్తి వచ్చిన విషయం వాస్తవమే. అది సరైన సమస్యే. దానికి ఓ కారణం ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తప్పకుండా వారి విజ్ఞప్తిని పరిశీలిస్తుంది అని ఆయన అన్నారు. పంజాబ్లో ఆడాల్సిన ఒకటి లేదా రెండు మ్యాచ్లను లక్నోకు మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీఎల్ పాలకమండలి శుక్రవారం ముంబయిలో సమావేశమై దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa