ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి : కడియం శ్రీహరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 12:22 PM

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో నందన గార్డెన్స్ లో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జయశంకర్ జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్, జనగామ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ సీపీ గౌతమ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్నందున అభివృద్ధి పనులు వేగంగా చేయాలని, చేసే పని కనపడే విధంగా ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలని సూచించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు. వీటిని దేశం మొత్తం ప్రశంసిస్తోంది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినపుడు వాటిని పరిష్కరించాలని అధికారులకు కడియం శ్రీహరి సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa