నిత్యం రద్దీగా ఉండే నగరంలో రయ్మంటూ దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులకు శుక్రవారం బ్రేక్ పడింది. వేసవి తాపం మొదలైంది అనుకున్న తరుణంలో అనుకోని అతిథిలా చిరుజల్లు నగరవాసులను పలకరించింది. రావాలా వద్దా అన్నట్టు చిరు చినుకులు పడుతూ వాహనదారులను కితకితలు పెట్టాయి. దాంతో ద్విచక్రవాహనాలపై వెళ్లే వారంతా జారిపడిపోతున్నారు. ఈ ఘటన నగరంలోని తెలుగు తల్లి ఫై ఓవర్పై చోటుచేసుకుంది. చిరు జల్లుల కారణంగా అప్పటివరకూ సిమెంట్ రోడ్డుపై పడివున్న వ్యర్థాలకు వాహనాల పొగ తోడై పెట్రో వ్యర్థాలు రోడ్లపై పేరుకపోయాయి.
దాంతో ఫ్లైఓవర్ ప్రాంతంలోని రోడ్లంతా జిగట జిగటగా మారాయి. ఈ విషయం గమనించని ద్విచక్రవాహనదారులు ఆఫీసులకెళ్లాలనే తొందరలో రయ్ రయ్మని దూసుకెళ్లారు. ఈ క్రమంలో రోడ్లు జిగటగా ఉండటంతో వాహనాలు బ్రేక్ వేయగానే కంట్రోల్ తప్పి జారిపోతున్నాయి. ఈ ఘటనలో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు కూడా. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై వాహనాలను అనుమతించకుండా మరోమార్గం మీదుగా మళ్లిస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa