హైదరాబాద్: శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను ఆదివారం ప్రగతిభవన్ జనహితలో నిర్వహించనున్నారు. సీఎం కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ విశిష్ట అతిథులుగా హాజరవుతారు. మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని, పద్మారావు, నాయిని, మహేందర్రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, బేగంపేట కార్పొరేటర్ తరుణి గౌరవ అతిథులుగా పాల్గొంటారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa