హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోల్కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్టులో సీఎం కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ మంత్రి పూర్ణేంద్ బస్తో పాటు పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఎంపీలు కవిత, జితేందర్రెడ్డి, రాజ్యసభ అభ్యర్థి సంతోష్ కుమార్ ఉన్నారు. మరికాసేపట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చించనున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.