ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్పై విచారణ చేపట్టారు. హత్నూర్ పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఆంగ్ల ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి విచారణ చేపట్టారు. సిబ్బంది ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేశారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం పరీక్ష ముగిసిన అనంతరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.