కోల్కతా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ కూడా మమతకు పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుతో మమత కాసేపు ముచ్చటించారు. అనంతరం మమత.. సీఎం కేసీఆర్తో సహా తెలంగాణ ప్రతినిధులను సచివాలయంలోకి తీసుకెళ్లారు. మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చించనున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.