పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్ సెక్రటేరియెట్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఎదురేగి స్వాగతం పలికారు మమతా బెనర్జీ. మూడో ఫ్రంట్ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ మమతా బెనర్జీతో చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ వెంట తెరాస ఎంపీలు కల్వకుంట్ల కవిత, కే.కేశవరావు ఉన్నారు. కోల్కతా చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సచివాలయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. సచివాలయం వద్ద చేరుకున్న కేసీఆర్కు మమత బెనర్జీ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సమావేశంలో మమతా బెనర్జీతో థర్డ్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండాపై కేసీఆర్ చర్చించనున్నారు.