వరంగల్ రూరల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ లో ఉన్న ఓ మిర్చి లారీకి ప్రమాదశాత్తు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 50 బస్తాలు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వరంగల్ నుంచి రాజస్థాన్ కు మిర్చి లోడ్ చేసుకొని వెళ్లే సమయంలో..పైనున్న విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.