ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 11:18 AM

హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థికసాయాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్థికసాయాన్ని రూ.75,116 నుంచి లక్షా నూట పదహారు రూపాయలకు పెంచిన సీఎం కేసీఆర్‌కు మహిళలు, తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొటకొండూర్ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు బొలగాని నాగమణిమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా అర్చన్ పల్లిలో టీఆర్ఎస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa