ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై సర్వే : కడియం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 12:05 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై సర్వే జరుగుతుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రతిపాదనలు వచ్చాయి. ఈ డిమాండ్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని.. ఆ మేరకు సర్వే చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థుల అవసరాలు, అనుకూలతలను బట్టి వీలైన చోట డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం మేరకు డిగ్రీ కళాశాలల ఏర్పాటు జరుగుతుందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa