ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా కాళేశ్వరం పనులు : హరీష్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 21, 2018, 10:28 AM

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద బ్యారేజీ పనులు కూడా వేగవంతం అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం కింద మొత్తం ఆయకట్టు 37,08,670 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి అయితే మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 60 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సదర్‌మాట్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మెట్ పల్లి నియోజకవర్గానికి మూడు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తామన్నారు. గంధమల్ల, బస్వాపురం దగ్గర 75 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇందులో 73 కిలోమీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa