కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకున్నది. దాడిలో 25 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. పీడీ3 కాంపౌండ్లో ఈ పేలుడు జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కారు బాంబుతో దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలీ అబద్ హాస్పిటల్, కాబుల్ వర్సిటీ సమీపంలో పేలుడు సంభవించింది. సెక్యూర్టీ దళాలు ఆ ప్రాంతాన్ని మూసేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ నవరోజ్(నూతన సంవత్సరం) జరుపుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa