హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంపై నిరంతరం నిఘా పెట్టి సరైన పద్దతిలో అమలు చేసేందుకు విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రాయోజిత పథకం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సన్నబియ్యం, వారానికి మూడు గుడ్లు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నామన్నారు. దేశం మొత్తంలో మధ్యాహ్న భోజన పథకం కేవలం 8వ తరగతి వరకే అమలు అవుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రమే 9,10 వ తరగతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలు, అమలు తీరుపై శాసనమండలిలో సభ్యులు భూపతిరెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి, రామచందర్ రావు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa