ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ బరిలో కోటీశ్వరులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 10:18 AM

   న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొననున్న 63 మంది అభ్యర్థుల్లో రూ. 122 కోట్ల సగటు ఆస్తులతో 87 శాతం మంది కోటీశ్వరులే ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) విశ్లేషించింది. రాజ్యసభ అభ్యర్థుల్లో జెడియుకు చెందిన మహేంద్ర ప్రసాద్‌ రూ. 4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎంపి అభ్యర్థిగా ఉన్న జయాబచ్చన్‌ రూ. 1001 కోట్ల ఆస్తుల్ని ప్రకటించి రెండో స్థానంలో ఉన్నారు. బిజూ జనతాదళ్‌కు చెందిన అచ్యుతానంద సమనంతా రూ.4 లక్షల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ప్రధాన పార్టీల్లో బిజెపి తరపున పోటీ చేస్తున్న 29 అభ్యర్థులలో 26మంది, కాంగ్రెస్‌ నుంచి 11 మంది అభ్యర్థుల్లో 10మంది, తృణమూల్‌ అభ్యర్థుల్లో నలుగురికి గాను ముగ్గురు, టిఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు, జెడియుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa