ఓ వెరైటీ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. కేసులెలా, ఎవరిమీద పెట్టాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారట. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్లు విని ఏం ఇదెక్కడి పంచాయితీ రా బాబోయ్ అని టెన్షన్ పడ్డారట. ఇంతకీ అంతలా ఇబ్బంది పెడుతున్న కేసు ఏంటంటే. ఒక భార్య ఇద్దరు భర్తలు. వినడానికేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటు. ఇది నిజంగా జరుగుతున్న ఎపిసోడ్. రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన కాంతాదేవికి గతేడాది త్రిలోక్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. అయితే ఆమె మొదటి భర్త ఉండగానే... మళ్లీ ఈ నెల 13న విజేంద్ర సింగ్ అనే వ్యక్తిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకొంది.
పెళ్లాయ్యాక ఇద్దరు కలిసి ఏదో పనిమీద ఓ ఆస్పత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న మొదటి భర్త త్రిలోక్ సింగ్ తన ఫ్రెండ్స్తో కలిసి కాంతాదేవి, విజేంద్రలపై దాడి చేశాడు. భయంతో వెళ్లి దాక్కున్నారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఇద్దరు కలిసి త్రిలోక్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అతడితో పాటూ స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. వారిని పీఎస్కు తీసుకొచ్చి ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుందని భార్య చేసిన ఘనకార్యాన్ని వారికి చెప్పాడు. ఇక అక్కడి నుంచి మొదలయ్యింది. పంచాయితీ ఇప్పుడు ఆమె ఎవరి భార్యతో తేల్చలేకపోతున్నారు పోలీసులు. ఎవరిపై కేసులు పెట్టాలి... ఎవర్ని అరెస్ట్ చేయాలో అర్థంకాక తలబొప్పి కట్టిందట. అందుకే ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చేకోవాలని వారికి తేల్చి చెప్పారట. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa