ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డా. అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో దాసరికి సత్కారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 02:40 PM

ఇటీవల ఊపిరితిత్తులు, మూత్రపిండాల సంబంధిత సమస్యతో కిమ్స్ లో చేరిన దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ మధ్యే కోలుకున్నారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు డా. అల్లు రామలింగయ్య కళా పీఠం ఆధ్వర్యంలో యువకళావాహిని నాగేశ్వరరావు నిర్వహిస్తున్న జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2016 వేడుకలో దాసరికి జాతీయ పురస్కారాన్ని ఇవ్వనున్నారు. చిరు చేతుల మీదుగా ఈ పురస్కారం అందించనున్నట్టు తెలుస్తుంది. రవీంద్ర భారతిలో జరగనున్న ఈ కార్యక్రమానికి మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు హాజరు కానున్నట్టు సమాచారం. వీరితో పాటు బ్రహ్మానందం, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, జి. జగదీశ్వర రెడ్డిలు కూడా ఈ పురస్కార మహోత్సవానికి హాజరవుతారని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం డా. అల్లు రామలింగయ్య కళా పీఠం పలువురు ప్రముఖులను సత్కరిస్తున్న సంగతి తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa