హైదరాబాద్ : రాష్ట్రంలో 23 నగర పంచాయతీలను పురపాలికలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్, నర్సంపేట్, సత్తుపల్లి, మధిర, గజ్వేల్, వేములవాడ, కొల్లాపూర్, అయిజ, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, హుజూర్నగర్, జమ్మికుంట, పరకాల, హుస్నాబాద్, బాదేపల్లి, దేవరకొండ, అందోల్, జోగిపేట, హుజురాబాద్ పట్టణాలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.