ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములవాడలో నేడు శ్రీసీతారామ కల్యాణోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 25, 2018, 08:21 AM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో నేడు శ్రీసీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. సీతారామ కల్యాణంతో పాటే శివపార్వతుల(హిజ్రా) కల్యాణంను జరిపించనున్నారు. ఉదయం 9.26 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వామివారి కల్యాణ వేడుకను నిర్వహించనున్నారు. ఆలయ ఛైర్మన్ అతిథిగృహం ఎదుట కల్యాణవేదికను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం చలువపందిళ్లు, తాగునీరు, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు లక్షల మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు విచ్చేయనున్నట్లు సమాచారం. భక్తుల సౌకర్యార్థం 8 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవం అనంతరం సాయంత్రం 4 గంటలకు స్వామివార్ల రథోత్సవ వేడుక జరగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com