ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎంపీ ధర్మబిక్షం వర్ధంతి సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి నివాళి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 12:19 PM

సూర్యపేట: తెలంగాణ సాయుధ రైతాంగపోరాట యోధుడు, మాజీ లోక్ సభ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రముఖ కమ్యూనిస్ట్ నేత బొమ్మగాని ధర్మ బిక్షం వర్ధంతిని సూర్యపేటలొ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ధర్మబిక్షం చేసిన పోరాటం వర్తమానానికి స్పూర్తిని మిగిల్చింది ప్రపంచ చిత్రపటంలో ఒకప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పటి సూర్యాపేట ప్రాంతానికి చోటు ప్రాధాన్యత ఏర్పడడానికి ధర్మబిక్షం వంటి నేతల త్యాగాలే కారణం. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలకు అయన ఒక ఐకాన్ లాంటి వారు. రజాకార్ల వ్యతిరేఖ పోరాటంలో అయన పాత్ర అజరామరంగా నిలుస్తుంది. రాజకీయాలలో విలువలను పాటించిన నేత ధర్మబిక్షం. లోకసభ సభ్యుడుగా శాసనసభ సభ్యుడుగా ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్యలను చట్ట సభలలో ప్రతిద్వనింప చేసిన నేత. వర్తమాన రాజకీయ నాయకులు ధర్మబిక్షం స్పూర్తితో ముందుకు సాగుదామని మంత్రి పిలుపునిచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa