హైదరాబాద్ : శాసనసభ, మండలిలో కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లును ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (2018 ఎల్ఏ బిల్ నం.7)ను, ఆ తరువాత తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (నంబర్-2) (2018 ఎల్ఏ బిల్ నంబర్ 8) ను శాసనసభలో ప్రవేశపెడ్తారు. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం మధ్యాహ్నం మండలిలో వీటిని ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. దీంతో చట్టసభల్లో వార్షిక బడ్జెట్ (2018-19) కు ఆమోదం లభించినట్టవుతుంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం లభించిన తరువాత బడ్జెట్లో కేటాయింపులకు అధికారిక ముద్ర లభిస్తుంది. కాగా కాగ్ నివేదిక మాత్రం మంగళవారం చట్టసభల ముందుకు రావడంలేదు. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడుతున్న దృష్ట్యా మంగళవారం ప్రశ్న్రోత్తరాలు, జీరో సమయాలను రద్దుచేశారు. అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందేవరకు శాసనమండలిలో చేనేత రుణాలు-హ్యాండ్లూమ్ రంగానికి సహాయం అనే ఆంశంపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa