ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి వ్యతిరేక కూటమి..ముమ్మర ప్రయత్నాల్లో మమత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 11:42 AM

 న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఏర్పాటు చేసిన విందుకు హాజరవనున్నారు. ఆమె ఐదురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా ఆమె కలవనున్నట్లు సమాచారం. కేంద్రంలో బిజెపి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మమతతో గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa