ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్ల కోసం పథకాలు ప్రవేశపెట్టలేదు : మంత్రి ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 12:09 PM

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసమే కొన్ని పథకాలు ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఓట్ల కోసమే పథకాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. పెన్షన్లు ఈ ఏడాది ప్రవేశపెట్టలేదు. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చామా? అధికారంలోకి వచ్చిన వెంబడే పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికలతో సంబంధం లేకుండా తెలంగాణకు గొప్ప పునాదులు వేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa