ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం..సీఈసీ ఓకే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 03:20 PM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా.. ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పోటీకి దిగాలని ఆదేశించేలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ కు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు పలికింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల అభిప్రాయాన్ని కోరగా.. ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నియమం పట్ల తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.ఒక అభ్యర్థి వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అనుమతించరాదని కోరుతూ బీజేపీ నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ కొన్ని నెలల కిందట పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ, సీఈసీల అభిప్రాయాలను కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. వాటికి సీఈసీ స్పందించింది. ఒక అభ్యర్థి, ఒకే నియోజకవర్గం ప్రతిపాదనకు తమ సమ్మతిని తెలియజేసింది.


అనేక మంది ప్రముఖ రాజకీయ నేతలు కూడా వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారి జాబితాలో ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో సహా అనేక మంది ప్రముఖ నేతలున్నారు. 2014 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ వడోదరా, వారణాసి ఎంపీ సీట్ల నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు. వడోదర సీటుకు రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఇక కేసీఆర్ కూడా ఎంపీ సీటుకు, ఎమ్మెల్యే సీటుకు పోటీ చేశారు. తెలంగాణ సీఎం పదవిని చేపట్టి ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది.


ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పలువురు నేతలు రెండు నియోజకవర్గాల్లో పోటీకి సన్నద్ధం అవుతున్నారు. ఇలాంటి వాళ్లు రెండు చోట్లా గెలిస్తే ఒక సీటుకు వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది, ఆ సీటు ఉప ఎన్నిక అదనపు ఖర్చుగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి నివారించాలని పిటిషనర్ సుప్రీంను కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa