హైదరాబాద్: ఓయూ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. బయోమెడికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఐఈఈఈ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. యూనివర్సిటీ చరిత్రలో నాలుగు విభాగాలు కలిసి ఇలాంటి సదస్సును నిర్వహించడం తొలిసారన్నారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇన్ ఇంజినీరింగ్ - 2018పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు మొత్తం తొమ్మిది దేశాల నుంచి 350 వరకు పరిశోధనా పత్రాలు సమర్పించారని, వాటిలో 100 పరిశోధనా పత్రాలను ఎంపిక చేశామని, మరో ఇరవై పత్రాలను పోస్టర్ ప్రజెంటేషన్కు ఎంపిక చేశామని వివరించారు. ఈ సదస్సును బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్మశ్రీ సయింట్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం ప్రారంభిస్తారన్నారు.